ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి


Contributors to Wikimedia projects

Article Images

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

ఇంద్రగంటి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఇంద్రగంటి చూడండి.

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (ఆగష్టు 29, 1911 - నవంబర్ 14, 1987) కవి-పండితుడు-విమర్సకుడు-వ్యాసకర్త-కథానికా రచయిత.

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

జననంఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఆగష్టు 29, 1911
India
మరణంనవంబర్ 14, 1987
ప్రభవ నామ సంవత్సరం, కార్తీక బహుళ అష్టమి
వరంగల్
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
మతంహిందూ
పిల్లలుఇంద్రగంటి శ్రీకాంతశర్మ

వీరేశలింగం యుగంలో పానుగంటి_లక్ష్మీనరసింహారావు వారివలె అధునాతనాంధ్ర సారస్వతయుగంలో ఈయన బాగా పేరుగాంచినారు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు గార్లు ప్రారంభించిన నవీనాంధ్ర సారస్వతోధ్యమంలో ఉత్సాహంతో పాలుపంచుకున్న యువకుల్లో ఈయనొకరు. నూతన మార్గాల్లో సాహిత్య విమర్స, కథానక రచన, కావ్య నిర్మాణం, చేస్తూన కొద్దిపాటి యువకుల్లో ఇతడు మంచి స్థానాన్ని ఆక్రమించినారు.

హనుమచ్ఛాస్త్రి గారి పేరుగాంచిన వ్యాసములు
  • సాహిత్యగోష్ఠి
  • ఆంధ్రులకు సంస్కృతం ఎంతవరకు కావాలి
  • కళా:నీతి
హనుమచ్ఛాస్త్రి గారి పేరుగాంచిన కథలు
  • ఆడవి పువ్వులు - ఇందులో వేదకాలం నాటి యువతీ యువకుల స్నిగ్ధ భావము, స్వేచ్చానుభావాలు రమణీయముగా చిత్రింపబడ్డాయి. ఇందులో కథ తక్కువ, శిల్పమెక్కువ,
  • కడుపు మంట- సామ్యవాద కథ ,
  • దౌర్జన్యం - ఇది స్త్రీలపట్ల పురుషులు చేస్తున్న దౌర్జన్యాలనుద్దేసించి రాసిన కథ.
  • బ్రతుకు చీకటి
  • కళాభాయి
  • ఈయన రచనలు పెక్కు భారతి, ఉదయిని, ప్రబుద్ధాంద్ర పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.
  1. దక్షారామము (ఖండకావ్యం)