కరణం బలరామకృష్ణ మూర్తి


Contributors to Wikimedia projects

Article Images

కరణం బలరామకృష్ణ మూర్తి (Karanam Balaram Krishna Murthy) (b. అక్టోబరు 31, 1946,) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇతడు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు.

కరణం బలరామకృష్ణ మూర్తి

కరణం బలరామకృష్ణ

జననంకరణం బలరామకృష్ణ
1946 అక్టోబరు 31 (వయసు 77)/అక్టోబరు.31,, 1946
తిమ్మ సముద్రం, ప్రకాశం జిల్లా
నివాస ప్రాంతంఒంగోలు
ఇతర పేర్లు ఒంగోలు పులి
ప్రసిద్ధిఒంగోలు పార్లమెంట్ సభ్యులు
పదవీ కాలం1978-83 మరియు1985-94 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సభ్యులు
1999 : 13 వ లోక్‌సభ సబ్యులు
1999-2000 : కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు
రాజకీయ పార్టీతెలుగు దేశం పార్టీ
మతంహిందూ మతము
భార్య / భర్తసరస్వతి
పిల్లలుఒక కుమారుడు
తండ్రివెంకటేశ్వర్లు
తల్లిఅన్నపూర్ణమ్మ

రాజకీయ జీవితం

మార్చు

భారత జాతీయ కాంగ్రెసుకు చాలా కాలంగా విధేయుడిగా నున్న ఇతడు 1977 సంవత్సరం ఇందిరా గాంధీ మీద ఒంగోలులో జరిగిన దాడిలో ఆమెను రక్షించినందుకు మీడియాలో బహుళ ప్రచారం పొందాడు. తర్వాత 1978 ఎన్నికలలో ఇంరిన అతన్ని అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికలలో మొదటిసారి ఎన్నికయి శాసనసభలో ప్రవేశించాడు..[1]

నిర్వహించిన పదవులు

మార్చు

2019 శాసనసభ ఎన్నికల లో చీరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్థి గా కరణం బలరాం 17,801 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కరణం బలరాం టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[3][4]

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు