నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం


Contributors to Wikimedia projects

Article Images

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

2007లో లోక్ సభ నియోజకవర్గాలు పునర్వవ్యవస్థీకరించే వరకు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గములో భాగంగా ఉండేది. పునర్వవస్థీకరణలో భాగంగా దాన్ని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.

  1. ఆళ్లగడ్డ
  2. డోన్
  3. నందికొట్కూరు
  4. నంద్యాల
  5. పాణ్యం
  6. బనగానపల్లె
  7. శ్రీశైలం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

మార్చు

లోక్‌సభ ఎన్నికలు కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ ఆధిక్యత
మొదటి 1952 1952-57 రాయసం శేషగిరిరావు ఇండిపెండెంట్ ఎస్.ఆర్.రెడ్డి కాంగ్రేసు 6,604
రెండవ 1957 1957-62 ఆదోని లోక్‌సభ నియోజకవర్గం[1]
మూడవ 1962 1962-67
నాల్గవ 1967 1967-71 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఎస్.రెడ్డి సి.పి.ఐ 1,68,825
ఐదవ 1971 1971-77 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ కె.ఎ.రెడ్డి ఎన్.సి.ఒ 1,30,456
ఆరవ 1977 1977 - 78 నీలం సంజీవరెడ్డి బి.ఎల్.డి పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ 35,743
1978 1978-80 పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ గొమాంగో జనతా పార్టీ 41,003
ఏడవ 1980 1980-84 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ (ఐ) ఆసిఫ్ పాషా కాంగ్రెస్ (యు) 78,378
ఎనిమిదవ 1984 1984-89 మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ 50,263
తొమ్మిదవ 1989 1989-91 బొజ్జా వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ 56,262
పదవ 1991 1991 గంగుల ప్రతాపరెడ్డి[2] భారత జాతీయ కాంగ్రెస్ చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ 186,766
1991[3] 1991-96 పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్ బంగారు లక్ష్మణ్ బి.జె.పి 5,80,035
పదకొండవ 1996 1996 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ 98,530
1996[3] 1996-98 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ రంగయ్య నాయుడు కాంగ్రెస్ 4,41,142
పన్నెండవ 1998 1998-99 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 4650
పదమూడవ 1999 1999-04 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 72,609
పదునాల్గవ 2004 2004-09 ఎస్.పి.వై.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ భూమా శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ 111,679
పదిహేనవ 2009 2009-14 ఎస్.పి.వై.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.మహమ్మద్ ఫరూఖ్ తెలుగుదేశం పార్టీ 90,847
పదహారవ 2014 2014- 2019 ఎస్.పి.వై.రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాస్యం ముహమ్మద్ ఫరూఖ్ తెలుగుదేశం పార్టీ 105766
17వ 2019 2019 - ప్రస్తుతం పోచా బ్రహ్మానంద రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాండ్ర శివానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ 2,50,119

2004 ఫలితాలను తెలిపే చిత్రం

  ఎస్.పి.వై.రెడ్డి (55.25%)

  భూమా నాగిరెడ్డి (41.79%)

  ఇతరులు (2.96%)

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్.పి.వై.రెడ్డి పోటీ చేస్తున్నాడు.[4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఇది వరకు తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లు విజయం సాధించిన భూమా నాగిరెడ్డి బరిలో ఉన్నాడు.[5] కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎస్.పి.వై రెడ్డి 400023 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి అయిన నాశ్యం మహామ్మద్ ఫరూఖ్ పై 90,847 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.

ఎస్.పి.వై.రెడ్డి 51.65%
నాస్యం మహమ్మద్ ఫరూఖ్ 42.88%
వి.వై.రామయ్య 1.36%
తుడం ఓబులేసు 0.98%
ఇతరులు 2%
2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
  • తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14
  1. 1957లో నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో నంద్యాల నియోజకవర్గాన్ని రద్దుచేసి కొత్త ఆదోని లోక్‌సభ నియోజవర్గాన్ని సృష్టించారు
  2. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు అనుగుణంగా గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేసి స్థానాన్ని ఖాళీ చేశాడు[1]
  3. 3.0 3.1 ఉప ఎన్నికలు
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009