అశోక స్తంభం
అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.
చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.
సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు ఉన్నాయి.
ఈ స్తంభంలో, కలువ పువ్వు (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు ఏనుగు, ఎద్దు, గుర్రం, సింహం గలవు.
ఈ ఏకసింహ రాజధాని వైశాలిలో గలదు.
క్రీ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది. | లుంబినీ లోని అశోక స్తంభం. | థాయిలాండ్లో చియాంగ్మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం. |