చిలుకూరి వీరభద్రరావు


Contributors to Wikimedia projects

Article Images

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది.[2] ఆయన 1939 లో మరణించాడు. [3]

చిలుకూరి వీరభద్రరావు

జననం17 అక్టోబర్ 1872

రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా

మరణం1939
వృత్తిచరిత్ర పరిశోధకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్రుల చరిత్రము
బిరుదుచరిత్రచతురానన

ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు అళియ రామరాయలు పూర్వం గోల్కొండ నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా గోల్కొండ కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు కృష్ణదేవరాయల వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు.అళియ రామరాయల ప్రవర్తన, వ్యక్తిత్వం, తళ్ళికోట యుద్ధంలో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.[4]

రాజమహేంద్రవరమున గల ఆంధ్రచరిత్ర పరిశోధకసభా ప్రతిష్ఠాపకులలో ఒకరైన వీరభద్రరావు గారికి 1928 లో నంద్యాల యందు సర్వేపల్లి రాధాకృష్ణన్ యాజమాన్యమున జరిగిన ' ఆంధ్ర మహాసభ ' లో ఆంధ్రచరిత్రచతురానన యను బిరుద మిచ్చి సత్కరించిరి.[5]

 
Wikisource

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: