జామ్‌నగర్


Contributors to Wikimedia projects

Article Images

జామ్‌నగర్

గుజరాత్ రాష్ట్రం, జామ్‌నగర్ జిల్లాలోని ఒక నగరం.

జామ్‌నగర్, భారతదేశ, పశ్చిమ తీరం, సౌరాష్ట్ర ప్రాంతంలోని గుజరాత్ రాష్ట్రంలోఉన్న ఒక నగరం. ఇది జామ్‌నగర్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఉంది. గుజరాత్‌లోని ఐదవ అతి పెద్ద నగరం. ఈనగరం గల్ఫ్ ఆఫ్ కచ్‌కు దక్షిణంగా 337 కిలోమీటర్లు (209 మై.) దూరంలో రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌కు పశ్చిమాన ఉంది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్, జామ్‌నగర్ జిల్లాలో ప్రపంచం లోనే అతిపెద్ద చమురు శుద్ధి, పెట్రో రసాయనాల సముదాయం ఉన్నాయి.[3]

Jamnagar

Nawanagar

metropolitan city/urban agglomeration

Clockwise from top: Lakhota Lake, Lesser Flamingos, Darbar Garh Market, Swaminaryan Temple

Official logo of Jamnagar

Seal of the Jamnagar Municipal Corporation

Nickname(s): 

Jewel of Kathiawar, Paris of Saurashtra, Oil City, Brass City, Chhota Kashi, Halar

Jamnagar is located in Gujarat

Jamnagar

Jamnagar

Location in Gujarat, India

Coordinates: 22°28′N 70°04′E / 22.47°N 70.07°E
Country India
రాష్ట్రంగుజరాత్
RegionSaurashtra
జిల్లాJamnagar
Established in1540
Government
 • TypeMayor–Council
 • MayorBinaben Kothari [1]
 • Deputy MayorKarsan Karmur [1]
విస్తీర్ణం
 • Total125 కి.మీ2 (48 చ. మై)
 • Rank5
Elevation17 మీ (56 అ.)
జనాభా

 (2011)

 • Total4,79,920
 • RankIndia : 87
 • జనసాంద్రత5,780/కి.మీ2 (15,000/చ. మై.)
DemonymJamnagari
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్

361 001-09

Telephone code0288
Vehicle registrationGJ-10
 
నవనగర్ మహారాజా జంసాహెబ్

నవనగర్ 1540 లో జామ్ రావల్ చేత స్థాపించబడిన పేరుగల రాచరిక రాష్ట్రానికి రాజధానిగాఉంది.[4] జామ్‌నగర్ చారిత్రాత్మకంగా నవనగర్ (కొత్త పట్టణం) అని పిలుస్తారు. ఇది సౌరాష్ట్ర ప్రాంతంలోని జడేజాల అతిముఖ్యమైన, అతిపెద్ద రాచరిక రాష్ట్రాలలోఒకటి. చారిత్రక రికార్డుల ప్రకారం ,బహదూర్ షా, గుజరాత్ సుల్తాన్, పావగడ ముట్టడిలో అతని పాత్రకు గుర్తింపుగా జం లఖాజీకి పన్నెండు గ్రామాలను ప్రసాదించాడు. అతను గ్రామాలను స్వాధీనం చేసుకున్నకొద్దికాలానికే, జం లఖాజీని అతని బంధువులైన తమచి దేడా, జామ్ హమీర్ జడేజా హత్యగావించారు. అతని కుమారుడు, జామ్ రావల్, తనతండ్రిని చంపిన వారిని చంపి, కచ్ పాలకుడయ్యాడు. కచ్ రాష్ట్రం గుజరాత్ సుల్తానేట్ నుండి సెమీ స్వతంత్రంగామారింది.

18వ శతాబ్దంలో, నవనగర్‌ను జడేజా రాజ్‌పుత్‌లు పరిపాలించారు. వీరు వారి శౌర్యం, సైనిక పరాక్రమానికి ప్రసిద్ధి చెందారు. వారు పొరుగు రాష్ట్రాలతో అనేక పోరాటాలు చేశారు. విదేశీ దండయాత్రల నుండి ఈ ప్రాంతాన్నిరక్షించడంలోముఖ్యమైనపాత్రపోషించారు. సా.శ.1807లో నవనగర్ బ్రిటీష్ రాజ్ కింద రాచరికరాష్ట్రంగా మారింది. రాష్ట్ర మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్జీ, అతని ప్రగతిశీల విధానాలు, రాష్ట్రాన్నిఆధునీకరించే ప్రయత్నాలు ప్రసిద్ధి చెందాయి. అతను అనేక పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రజా సౌకర్యాలను సమకూర్చాడు. అతను ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1920లలో తన హయాంలోనగర ఆధునిక మౌలికసదుపాయాలను రూపొందించడంలో జంసైబ్ కీలకపాత్ర పోషించాడు.జామ్ సాహెబ్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ 1940లలో ఇది నవనగర్ రాచరిక రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు నగర అభివృద్ధిని విస్తరించారు.

ప్రధాన జన సమూహాలలోజడేజా,ఖవాస్ ర్జ్‌పుత్,చరణ్ (గాధ్వి),సత్వరాలు (దళ్వాడీలు), అహిర్స్ సాగర్‌లు,పటేళ్లు,భానుషాలీలు,రాజ్‌పుత్‌లు,మెర్స్,జైనులు, లోహానాలు, బ్రాహ్మణులు,భోయి(భోయిరాజ్) ,హిందువులు (ఎంలు) ఉన్నారు.

జామ్‌నగర్‌కు సమీపంలోరెండుముఖ్యమైన ఓడరేవులు ఉన్నాయి. మొదటిది రోజీ ఓడరేవు కచ్ గల్ఫ్ ఒడ్డునఉంది.రెండవది బేడీ ఓడరేవు రంగమతి నదిపై లోతట్టులో (4 కిలోమీటర్లు (2.5 మై.)దూరంలోఉంది.బేడీ ఓడరేవు అనేది బాక్సైట్,సోయా మీల్ ఉత్పత్తులు,వేరుశెనగఉత్పత్తులతోసహావివిధవస్తువులనుఎగుమతి చేసేఅన్ని కాలాలలో,వాతావరణపరిస్థితులలోపనిచేసేఓడరేవు.ఓడరేవు దిగుమతుల్లో బొగ్గు, ఎరువులు,ఇతరవస్తువులుఉంటాయి.

మెరైన్ జాతీయ ఉద్యానవనం కలిగిఉన్న 42 ద్వీపాలలో పిరోటాన్ పగడపు దిబ్బల ద్వీపంఒకటి.పైరోటన్ అరేబియాసముద్రంలోఉంది,ఇదితీరానికి 12 నాటికల్ మైళ్ల దూరంలోఉంది.అది 3 చదరపు కిలోమీటర్లు (1.2 చ. మై.) వరకు విస్తరించి ఉంది.

జామ్‌నగర్‌కు ఈశాన్యం 10 కిలోమీటర్లు (6.2 మై.) దూరంలో ఖిజాడియా పక్షుల అభయారణ్యం ఉంది.ఇది1982 నవంబరున 6న స్థాపించబడింది.[5] ఇది కాలానుగుణమైనమంచినీటినిస్సార సరస్సు,అంతర్-టైడల్ మడ్‌ఫ్లాట్స్, క్రీక్స్, సాల్ట్‌పాన్‌లు,సెలైన్ ల్యాండ్,మడఅడవులనుకలిగి ఉంటుంది.[6] ఈప్రదేశం గ్రేట్ క్రెస్టెడ్ గ్రేబ్, లిటిల్ గ్రేబ్, పర్పుల్ మూర్హెన్,కూట్,బ్లాక్-వింగ్డ్ స్టిల్ట్,నెమలి తోక జియాకానా సంతానోత్పత్తి ప్రదేశం.[7] హారియర్‌లు,డేగలు,గద్దలు,ఫాల్కన్‌లతో సహా రాప్టర్‌లు కూడా ఇక్కడ నివసిస్తాయి.ఈఅభయారణ్యం స్వాలోస్,మార్టిన్స్,వాగ్ టెయిల్స్,వాటర్ ఫౌల్ వంటివలసపక్షులకుఆశ్రయంకల్పిస్తుంది.

జామ్‌నగర్‌ ప్రాంతంలోభారీస్థాయిలోబాక్సైట్ నిల్వలుఉన్నాయి.దానిగనులురాష్ట్రంలోని మొత్తంఉత్పత్తిలో 95% వాటానుకలిగిఉన్నాయి.[8]

జామ్‌నగర్‌లో వేడిపాక్షిక-శుష్క వాతావరణం ఉంటుంది (కొప్పెన్). మూడు నిర్వచించిన కాలాలు ఉన్నాయి.ఈకాలంలోఉష్ణమండల తుఫానులు కొన్నిసార్లు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.అక్టోబరునుండిఫిబ్రవరి వరకు చల్లనికాలం పగటిపూటవేడిగా ఉంటుంది,అయితేఅతితక్కువ వర్షపాతం,తక్కువ తేమ,చల్లని రాత్రులు ఉంటాయి.

 
బంధేజ్ వస్త్రం

స్థానిక జనాభా వారి పూర్వీకుల జరిపిన మత్స్య వ్యాపారాలను వదులుకుంది. పారిశ్రామికీకరణ,అనేక దిగ్గజకంపెనీల రాకతో సృష్టించబడిన సంస్థలలో విభిన్న ఉద్యోగాలను చేరారు.నగరంలోనిజనాభాలోదాదాపు 10% మంది సాంప్రదాయ బంధాని వస్త్రం ఉత్పత్తి చేయడం,ఎగుమతిచేయడంద్వారాతమఆదాయాన్నిపొందుతున్నారు. దిగ్జామ్ జామ్‌నగర్‌లోచెత్తబట్టలతయారీకాంపోజిట్ మిల్లునునడుపుతోంది.ఇది భారతదేశంలోని చెత్త వస్త్రపరిశ్రమలోగుర్తించదగినప్రముఖపరిశ్రమగుర్తించబడింది.

జామ్‌నగర్‌ను గతంలో ఇత్తడి నగరం అని పిలిచేవారు,ఎందుకంటే నగరం ఇత్తడి వస్తువులనుతయారు చేయటానికి ప్రసిద్ధి చెందింది.నగరంలో 5,000 కంటే ఎక్కువ పెద్ద-స్థాయి10,000 చిన్నస్థాయిఖార్ఖానాలుఉన్నాయి.ఇవిఎక్కువుగా శంకర్ టేక్రి, జిఐడిసి ఫేజ్-III,ఎం.పి. షా ఉద్యోగనగర్,డేర్డ్ జిఐడిసి-II పారిశ్రామిక వాడలలో,చుట్టుపక్కల ఉన్నాయి.ఈ కార్కానాలుఎగుమతి కోసం ఇత్తడిభాగాలు,వెలికితీసిన రాడ్‌లను తయారు చేస్తాయి.జామ్‌నగర్ భారతదేశంలోఇత్తడివస్తువులను అత్యధికంగాఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాలకు ఈ నగరంనిలయంగా ఉన్నందున దీనిని ప్రపంచ చమురునగరంగా పిలుస్తారు.జామ్‌నగర్ రిఫైనరీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని సంస్థ.దీనిని 1999 జులై 14న ప్రారంభించారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ.[9] నగర సమీపప్రాంతాలలోగణనీయమైన బాక్సైట్ నిల్వలనుకలిగిఉంది.దానిగనులురాష్ట్రంలోనిమొత్తంఉత్పత్తిలో 95% వాటాను కలిగి ఉన్నాయి.[8]

జామ్‌నగర్‌లో భారత వైమానికదళం,భారత సైనికదళం,భారత నావికాదళం ప్రధాన స్టేషన్లు ఉన్నాయి.ఈ నగరం పాకిస్థాన్‌కుసమీపంలోవ్యూహాత్మక ప్రదేశంగాకలిగి ఉంది.

జామ్‌నగర్‌లో సిధ్‌నాథ్ మహాదేవ్ ఆలయం,బద్రీ కేదార్ నాథ్,నీలకంఠ మహాదేవ్ ఆలయం, భిద్ భంజన్ మహాదేవ్ ఆలయం,కెవి రోడ్‌లోని కాశీవిశ్వనాథ ఆలయంవంటి అనేక దేవాలయాలుఉన్నాయి.ఇది నాలుగు పాలరాయిజైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.వర్ధమాన్ షా ఆలయం,రైసీ షా ఆలయం,షెత్ ఆలయం,వాసుపూజ్య స్వామి ఆలయం ఉన్నాయి.ఈదేవాలయాలన్నీ సా.శ. 1574 నుండి సా.శ. 1622 మధ్య కాలానికి చెందిన పురాతనఆలయాలు.జామ్‌నగర్‌లో 30కి పైగా జైన దేవాలయాలు ఉన్నాయి.

రణ్మయి సరస్సుఆగ్నేయ వైపునఉన్నబాల హనుమాన్ ఆలయం "శ్రీరాం, జై రామ్, జై జై రామ్" అనేమంత్రాన్ని నిరంతరం ఉచ్చరించడానికి ప్రసిద్ధి చెందింది.1964 ఆగష్టు 1 నుండి,ఈ శ్లోకం రోజులో 24 గంటల పాటు కొనసాగుతుంది.ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానంసంపాదించింది.[10] ప్రతిసంవత్సరం వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.భోళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోజాతరజరుగుతుంది.పవిత్రశ్రావణమాసంలో, బోహ్రా హజీరా సమీపంలో ఎండిపోయిననదిఒడ్డునహిందూజాతరలు జరుగుతాయి.[11]

 
భోళేశ్వర్ మహాదేవ్

భోళేశ్వర్ మహాదేవ్ ఆలయం ఇది లాల్పూర్ తాలూకాలోని మురళి గ్రామం నుండి సుమారు 2 కిలోమీటర్లు (1.2 మై.) దూరంలోఉంది.ఈఆలయం ధంధార్ నది ఒడ్డున ఉంది.

భుజియో కోథో ఖంభాలియా ద్వారం సమీపంలో లఖోటా సరస్సు ఒడ్డున ఉంది. ఈ ఐదు అంతస్తుల స్మారక కట్టడందండయాత్రల సమయంలో నగరాన్ని రక్షించింది.మొదటి అంతస్తులో,ప్రతి దిశలో తుపాకులు ఉన్నాయి.తుపాకులకోసం గోడలకురంధ్రాలు ఉన్నాయి.పై అంతస్తులోనీటితొట్టి ఉంటింది.దానిశిఖరంపైనృత్యం చేసేనెమలి ఆకారంలో బొమ్మ ఉంటుంది.2001లో సంభవించిన భూకంపంలో భుజియో కోథో పాక్షికంగా కూలిపోయింది.

బోహ్రా హజీరా [11] లో జామ్ రావల్ నిర్మించిన తెల్లటి పాలరాతి సమాధి. మజార్ ఇ బద్రీ అని కూడాపిలుస్తారు.ఇది ముస్లింసెయింట్ మోటా బావా విశ్రాంతి స్థలం.[11] బొహ్రా హజీరానాగమతి,రంగమతి నదులఒడ్డున ఉంది.[11] సమాధి సరాసినిక్ శైలిలో ఉంటుంది.క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంటుంది.[11]

దర్బార్‌గఢ్ (రాజభవనం), జామ్ సాహెబ్ పాత రాజ నివాసం. జామ్‌నగర్‌లోని అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక సముదాయం, రాజ్‌పుత్ నివశించిన ఈ రాజభవనం ఐరోపా నిర్మాణ శైలుల కలయికను ప్రతిబింబిస్తుంది. అర్ధ వృత్తాకార రాజభవనం సముదాయంలో రాతి శిల్పాలు, గోడలపై పెయింటింగ్‌లు, ఫ్రెట్‌వర్క్ జాలి తెరలు, అలంకార అద్దాలు, చెక్కిన స్తంభాలు, శిల్పాలతో అనేక భవనాలు ఉన్నాయి. వెలుపలి గోడలలో భారతీయ సంప్రదాయంలో చెక్కబడిన ఝరోఖా బాల్కనీలు, చెక్కిన ద్వారం, వెనీషియన్-గోతిక్ తోరణాలు ఉన్నాయి. 2001లో సంభవించిన భూకంపం దర్బార్‌గఢ్‌కు గణనీయమైన నష్టాన్ని కలిగించింది.

జామ్‌నగర్ త్రిమందిర్ అనేదిరెండుఅంతస్తులనిర్మాణం,కిందిఅంతస్తులో పెద్దవరండా ఉంటుంది.మొదటి అంతస్తులోదేవాలయం ఉంది.[12]

సా.శ.17వ శతాబ్దంలోఖంభాలియా దర్వాజాను వజీర్ మెరమాన్ ఖావా నిర్మించాడు.[13] ఆ కాలంనుండి మిగిలిన రెండునగర ద్వారాలలో ఇది ఒకటి.[13]

 
లఖోటా ప్యాలెస్

లఖోటా రాజభవనం లఖోటా సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఇది ఒకప్పుడునవనగర్ మహారాజుకు చెందింది.ఈ చిన్నకోట లాంటిభవనం అర్ధ వృత్తాకారంతోబురుజులు, చిన్న గోపురాలు, కాపాలాదారులగదులు,గృహ కత్తులు, పౌడర్ ఫ్లాస్క్‌లు,మస్కెట్ లూప్‌లతోకూడినమంటపం ఉన్నాయి.ఒక వంపుతో కూడిన రాతి వంతెన లఖోటారాజభవనంనుపట్టణంతోకలుపుతుంది.

మోటా ఆషాపురా మా ఆలయం జామ్‌నగర్ తూర్పుభాగంలోఉంది.ఇక్కడ ప్రవేశ ద్వారం పాత నగర ప్రాంతంలోకి వెళుతుంది.జడేజా వంశం దానిపోషక దేవత (కుల్దేవి) కోసం ఈ ఆలయాన్ని నిర్మించింది.

 
.ప్రతాప్ విలాస్ ప్యాలెస్
 
సైఫీ టవర్
 
శాంతినాథ్ మందిరం
 
సోలారియం

శ్రీ నవతాన్‌పురి ధామ్‌ని 1630లో నిజానంద స్వామి శ్రీ దేవచంద్రేజీ స్థాపించారు.పూర్వం ఈ పవిత్ర స్థలం తోటగా ఉండేది.ప్రణమి విటక్-సంప్రదాయం ప్రకారం,దేవచంద్రజీ తోటలోకి ప్రవేశించి, తన దంతాలనుశుభ్రం చేయడానికి ఖిజ్డా చెట్టు కొమ్మను ఉపయోగించేవాడు. అప్పుడు అతనుభూమిలో నాటిన కొమ్మను రెండు ముక్కలుగా చేసాడు. కాలక్రమేణా,కొమ్మలు రెండుచెట్లుగా మారాయి.అవి ఇప్పటికీ మందిరానికి జోడించబడ్డాయి.ఈ పురాణం కారణంగా,ఈఆలయాన్ని ఖిజాడ మందిర్ అని కూడా పిలుస్తారు.[14]

ప్రతాప్ విలాస్ రాజభవనం,హిజ్ రాయల్ హైనెస్ రంజిత్‌సిన్హ్జీ పాలనలో నిర్మించబడింది, ఇది భారతీయ శిల్పాలతో కూడిన యూరోపియన్ నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఇది కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ భవనంఅనుకరణ,కానీ దాని గోపురాలు భారతీయ నిర్మాణ సంప్రదాయంలోఉన్నాయి.రాజభవనం స్తంభాలలోలతలు,పువ్వులు,ఆకులు, పక్షులు,జంతువులచిత్రాలు చెక్కబడ్డాయి2001 భూకంపం దాని పిట్టగోడలకు కొంత నష్టం కలిగించింది.కొన్నిమూలల్లోని పైకప్పుస్థాయిలో కొన్ని పైగోడలు వేరు చేయబడ్డాయి.

శాంతినాథ్ మందిరం జామ్‌నగర్‌లోని బేడీ ద్వారానికి నైరుతి దిశలో ఉంది.ఈ ఆలయం జైన సాధువుల జీవితాలను వర్ణించే కుడ్యచిత్రాలతో అలంకరించబడిన క్లిష్టమైన శిల్పాలు కలిగిన గోడలను కలిగి ఉంది. నేల పాలరాయితో కూర్పు చేసారు. పసుపు, నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో విలక్షణమైన జైన నమూనాలతో అలంకరించారు. జైనమతంలో 16వ తీర్థంకరుడైన శాంతినాథుడు ఈ ఆలయానికి పేరుగాంచాడు.

జామ్‌నగర్‌లోని ప్రధాన జైన దేవాలయాలలో వర్ధమాన్ షా ఆలయం ఒకటి. దీని మందిరం జైనమత మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్‌జీకి అంకితం చేయబడింది.[15] దీని నిర్మాణం సా.శ. 1612లో జామ్ జసాజీ I హయాంలో ప్రారంభమై,1620లో పూర్తయింది. 1622లో, భక్తులు ప్రధాన భవనం చుట్టూ 52 చిన్న దేవాలయాలను నిర్మించారు

కోథా బాస్టన్ సంగ్రహశాలలో శిల్పాలు, నాణేలు, శాసనాలు, రాగి పలకలు, తిమింగల అస్థిపంజరం ఉన్నాయి.

లఖోటా సంగ్రహశాలలో పూర్వపు లఖోటా రాజభవనంలో ఉంది. ఈ చిన్న సంగ్రహశాల 9 నుండి 18వ శతాబ్దాల నాటి శిల్పాలు, పురాతన ఆయుధాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి మధ్యయుగ గ్రామాలలో లభించిన కుండలు ఉన్నాయి.[16]

 
రంజిత్‌సిన్హ్జీ

భుచార్ మోరీ షాహిద్ వాన్

మార్చు

భుచార్ మోరి షాహిద్ వాన్ ఒక పీఠభూమి, సుమారు 2 కిలోమీటర్లు (1.2 మై.) చారిత్రక ప్రదేశం జామ్‌నగర్ జిల్లాలోని ధ్రోల్‌కు వాయువ్యంగా ఉఁది. ఈ ప్రదేశం భుచార్ మోరీ యుద్ధానికి ప్రసిద్ధి చెందింది ఇది ఒక స్మారక ప్రదేశం.ఉద్యానవనం, పిల్లల కోసం ఆట స్థలం, ఒక చిన్న కృత్రిమ పర్వతం, పర్యాటకుల విశ్రాంతి కోసం గుడిసె లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి.ఈ ప్రదేశంలో అజాజీకి స్మారక రాయి ఉంది.ఇది గుర్రపు విగ్రహం.1591 జులైలో కతియావర్ (నవానగర్ రాష్ట్రం) సైన్యం, మొఘల్ సైన్యం మధ్య జరిగిన యుద్ధాన్ని సూచించే గోడ శిల్పాలు ఉన్నాయి.

జామ్‌నగర్, భుజ్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, ముంబై, పూణే, ఇతర ప్రధాన నగరాల మధ్య అనేక ప్రైవేట్ బస్ సేవలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా గుజరాత్ రాష్ట్రంలోని దాదాపు అన్ని నగరాలకు, అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలను కలిగి ఉంది. జామ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక బస్సుల సేవలు ఉన్నాయి. అలాగే, ఓలా క్యాబ్‌లు, ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి.

జామ్‌నగర్‌లో భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ ఉంది.[17]ముంబైకి నాలుగు రోజువారీ రైళ్లు, దేశంలోని ఉత్తరం, తూర్పు, దక్షిణాన ఉన్న ప్రధాన నగరాలకు వారానికో రైళ్లు వెళ్తాయి.

నగరంలో ప్రతిరోజూ ముంబైకి నేరుగా విమానాలు హైదరాబాద్, బెంగళూరులకు వారానికి మూడుసార్లు విమాన సేవలు ఉన్నాయి. విమానాశ్రయం భారత వైమానిక దళం మిలిటరీ ఎన్‌క్లేవ్‌లో ఉంది.

కింది వ్యక్తులు జామ్‌నగర్‌లో జన్మించారు లేదా నివసించారు:

  1. 1.0 1.1 "Hasmukh Jethwa is new Mayor of Jamnagar, Karsan Karmur his deputy". deshgurat. 15 Jun 2018.
  2. "Amdavad city". Ahmedabad Municipal Corporation. Archived from the original on 27 June 2013. Retrieved 20 June 2012.
  3. "Jamnagar: Reliance Industries Limited". Archived from the original on 24 October 2008. Retrieved 30 October 2008.
  4. Crill, Rosemary; Jariwala, Kapil (2010). The Indian Portrait, 1560–1860 (in ఇంగ్లీష్). Mapin Publishing Pvt Ltd. p. 88. ISBN 978-81-89995-37-9 – via Google Books.
  5. "A Heaven for Waders". Waders Wildlife and Birding Tours of Gujarat and Kutch. Web Archive. 2011-07-21. Archived from the original on 4 March 2018. Retrieved 2022-11-12.
  6. "Welcome to the Khijadiya Bird Sanctuary, Jamnagar, Gujarat, India". Khijadiyabirds.com. 22 June 2010. Archived from the original on 15 జూన్ 2012. Retrieved 22 June 2012.
  7. "Jamnagar, the bird watchers paradise". www.jamnagar.org. Retrieved 2022-11-12.
  8. 8.0 8.1 "Jamnagar Municipal Corporation". www.mcjamnagar.com. Retrieved 2022-11-11.
  9. . "Jamnagar gets ready to make its mark".
  10. Balakrishna, VN (2009-07-31). "Non-Stop Ram Dhun completes 45 years in Jamnagar". Desh Gujarat. Retrieved 2022-04-04.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 "Bohra Hajira, Jamnagar - Timings, History, Pooja & Aarti schedule". Trawell.in. Retrieved 2022-11-12.
  12. bhagwan, dada. "List of Trimandir's | Trimandir | Non-Sectarian Temple | Spiritual Temples". www.dadabhagwan.org (in ఇంగ్లీష్). Retrieved 2022-11-11.
  13. 13.0 13.1 "Khambhaliya Gate |, India | Attractions". www.lonelyplanet.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-12.
  14. "Home". krishnapranami.org. Archived from the original on 2023-06-02. Retrieved 2023-06-26.
  15. "Jain Temple In Jamnagar – The Jainsite World's Largest Jain Website". jainsite.com. Retrieved 2022-11-11.
  16. "Lakhota Palace & Museum Jamnagar, Gujarat". www.tourmyindia.com. Retrieved 2022-11-12.
  17. "Jamnagar/JAM Railway Station – Today's Train Departure Timings – India Rail Info – A Busy Junction for Travellers & Rail Enthusiasts". India Rail Info. 6 August 2010. Retrieved 22 June 2012.