ఝున్‌ఝును


Contributors to Wikimedia projects

Article Images

ఝున్‌ఝును, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని, ఝున్‌ఝును జిల్లాకు చెందిన ఒక నగరం, ఈ నగరం భారతదేశం,రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్‌ఝును జిల్లా ఉత్తర స్థితిలో జిల్లా పరిపాలనా కేంద్రంగా ఉంది. ఝున్‌ఝును నగరం ప్రధానంగా వస్త్ర, రాగి ఉత్పత్తులు పేరు గడించింది.

ఝున్‌ఝును

రాణి సతి ఆలయం

రాణి సతి ఆలయం

ఝున్‌ఝును is located in Rajasthan

ఝున్‌ఝును

ఝున్‌ఝును

భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్ర పటం

ఝున్‌ఝును is located in India

ఝున్‌ఝును

ఝున్‌ఝును

ఝున్‌ఝును (India)

Coordinates: 28°08′N 75°24′E / 28.13°N 75.4°E
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఝున్‌ఝును
Government
 • పార్లమెంటు సభ్యుడునరేంద్ర కుమార్ (బిజెపి)
Elevation323 మీ (1,060 అ.)
జనాభా

 (2011)

 • Total1,18,473
భాషలు
 • అధికారహిందీ , హర్యన్వి
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్

333001

ప్రాంతీయ ఫోన్‌కోడ్+91-1592
Vehicle registrationRJ-18
అక్షరాస్యత73.58%

ఇది జైపూర్ నుండి 180 కి.మీ, బికనీర్ నుండి 220 కి.మీ, ఢిల్లీ నుండి 240 కి.మీ.దూరంలో ఉంది. ఈ నగరం గోడ మీద చిత్రాలతో చిత్రించిన గొప్ప రాజభవనాలకు పేరొందింది. విండ్ ప్యాలెస్ అని పిలువబడే ఖేత్రి మహల్, జైపూర్ మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ ను ప్రేరేపించింది.దాని ప్రేరణతో అతను జైపూర్ లో ప్రత్యేకమైన నిర్మాణంతో హవా మహల్ను నిర్మించాడు. అతను నిర్మించేటప్పుడు నిర్మాణం గురించి చాలా భయపడ్డాడు. ఇది తరువాత చారిత్రక భవనంగా గుర్తించబడింది. రాణి సతి ఆలయం ఝున్‌ఝును నగరంలో ఉంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఝున్‌ఝును పట్టణంలో 118,473 జనాభా ఉంది. వీరిలో పురుషులు 61,548 ఉండగా, స్త్రీలు 56,925 మంది ఉన్నారు. స్త్రీ-పురుష నిష్పత్తి స్త్రీల లింగనిష్పత్తి 62:57గా ఉంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 16,710 మంది ఉన్నారు.వారిలో 8,953 మంది బాలురు ఉండగా, 7,757 మంది బాలికలు ఉన్నారు.నగర మొత్తం జనాభాలో పిల్లల14.10% మంది ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 73.58%.మొత్తం జనాభాలోఅక్షరాస్యులు 74,880 మంది ఉండగా, వారిలో 43,942 మంది పురుష అక్షరాస్యులు, 30,938 స్త్రీల అక్షరాస్యులు ఉన్నారు. ఝున్‌ఝును నగరం లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 925 స్త్రీలు ఉన్నారు. బాలికల పిల్లల లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 866 మంది ఉన్నారు.[1] హిందువులు, ముస్లింలు వందల సంవత్సరాల నుండి కలిసి జీవించిన మత సామరస్యం చరిత్ర ఝున్‌ఝును నగరానికి ఉంది.[2]

రాజస్థాన్ క్రీడా విశ్వవిద్యాలయం, రాజస్థాన్‌ రాష్ట్రంలో క్రీడా విద్యను ప్రోత్సహించడానికి ఝున్‌ఝును పట్టణంలో కొత్తగా స్థాపించబడిన మొదటి ప్రభుత్వ క్రీడా విశ్వవిద్యాలయం. ఝున్‌ఝును నగరంలో అనేక పాఠశాలలు, ఉన్నత విద్యా కళాశాలలు, పాలిటెక్నిక్స్, మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లు, ఇతర ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు ఇంకా ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ఝున్‌ఝును నగరానికి చదువుకోవడానికి వస్తారు.

ఝున్‌ఝును నార్త్ వెస్ట్రన్ రైల్వే భూభాగంలోకి వస్తుంది.ఝున్‌ఝును నగరం బ్రాడ్‌గేజ్ లైన్ ద్వారా సికార్, రేవారీ, ఢిల్లీకి అనుసంధానించబడి ఉంది. రాజస్థాన్‌లోని 122 కిలోమీటర్ల లోహారు-సికార్ రైల్వే లైన్ 260 కోట్లఖర్చుతో గేజ్ మార్పిడి లైను నిర్మించబడింది. ఝున్‌ఝును, డెహ్లీ మధ్య రైలు సర్వీసు (14811/14812) ఢిల్లీ సారాయ్ రోహిల్లా-సికార్ ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి) 2015 సెప్టెంబరు 2 ప్రారంభమైంది.

ఝున్‌ఝును నగరాన్ని రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్ల ద్వారా బాగా అనుసంధానించబడిన, ఆర్జే-ఎస్‌హెచ్ 8 జైపూర్, సికార్, లోహారులతో కలుపుతుంది. ఝున్‌ఝునును ఆర్జే-ఎస్‌హెచ్ 41 ద్వారా ఫతేపూర్‌ను రాజ్‌గఢ్ కలుపుతుంది.

ఝున్‌ఝును నగరానికి సమీప విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ పక్కన, చిన్న విమానాల కోసం ఝున్‌ఝును ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉంది.

  • శ్రీ భగవాన్ దాస్ ఖేతాన్ వైద్యశాల పట్టణంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ కాయకల్ప్ కార్యక్రమంలో, 2018 లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బృందం ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఉత్తమ ప్రభుత్వ ఆసుపత్రి అవార్డును అందుకుంది.
  • రక్షణ దళాల మాజీ సైనికుల కోసం ప్రభుత్వ ఇసిఎచ్ఎస్ పాలీ-క్లినిక్ ఉంది.
  • ప్రజలందరికి తెలిసిన సుమన్ వైద్యశాల ఉంది.
  1. "Jhunjhunun City Census 2011". census2011.co.in. Retrieved August 13, 2016.
  2. Sharma, Kalpana. "A town full of surprises". indiatogether.org. Indiatogether.org. Retrieved 4 February 2018.