పసునూరి దయాకర్


Contributors to Wikimedia projects

Article Images

పసునూరి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన లోక్‌సభ సభ్యుడు. వరంగల్లు (ఎస్.సి) వరంగల్ నుండి 16వ లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున నుండి ప్రస్తుత 17వ లోక్ సభ ఎన్నికలలో 2వ సారి విజయం సాధించిన లోక్‌సభ సభ్యుడు.

పసునూరి దయాకర్

నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు


జననం 1967 ఆగస్టు 2
బొల్లికుంట సంగెం మండలం: వరంగల్ జిల్లా:
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కమలమ్మ, ప్రకాశం
జీవిత భాగస్వామి జయవాణి ( 1995 డిసెంబర్‌ 4)
సంతానం రోని భరత్, ప్రీతమ్‌

ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం లోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ, ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2 న జన్మించారు. ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. ఆయన వృత్తి రీత్యా చిత్రకారుడు, తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త. దయాకర్‌కు 1995 డిసెంబరు 4న జయవాణితో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు కుమారులు రోని భరత్, ప్రీతమ్‌ ఉన్నారు.[1]

గ్యాస్ ఏజెన్సి ముందు వృత్తి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణా ఉద్యమంలో తొలి నుంచి సేవలందిస్తున్నారు.[2].

టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాఫ్ల ఏర్పాటుకు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు.[3] వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్టీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆరెస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టుసడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.

పసునూరి దయాకర్‌ 2023 మార్చి 16న బీఆర్ఎస్ పార్టీని వీడి హైదరాబాద్ గాంధీభవన్‌లో  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

పసునూటి దయాకర్ 2015 వరంగల్ ఉపఎన్నిక పోరు ఓ రికార్డు. రాష్ట్ర చరిత్రలో భారీ మేజారిటీ నమోదు అయ్యింది. పసునూటికి 6,15, 403 ఓట్లూ రాగ. కాంగ్రేస్కు సర్వే సత్యనారాయణకు 1, 56, 315 ఓట్లూ వచ్చినవి . భారతీయ జనతా పార్టీ డా|| పగిడిపాటి దేవయ్యకు 1,30, 178 ఓట్లూ వచ్చినవి, కాగా పసునూటి ఓట్లూ 4,59,092 భారీ మేజారిటీ నమోదు అయ్యింది[5].