మద్దాల రామారావు


Contributors to Wikimedia projects

Article Images

మద్దాల రామారావు ప్రముఖ రంగస్థల నటుడు.[1]

మద్దాల రామారావు

ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. పౌరాణిక నాటకాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉండేది. ఆయనకు తెలుగు రాష్ట్రాలలోనే కాక ఖరగ్‌పూర్‌, రాయపూర్‌ వంటి తెలుగేతర ప్రాంతాల్లోనూ ఆయనకు విశేషంగా అభిమానులు ఉన్నారు. మైరావణ, రావణ, దుర్యోధన వంటి పాత్రలకు ఆయన రంగస్థలంపై జీవం పోశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.[2] ఆయన జూలై 31 2017 న తన 90వ యేట మరణించారు.[3]